బస్‌ పాస్‌ చార్జీలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

బస్‌ పాస్‌ చార్జీలు తగ్గించాలి

Jun 19 2025 7:52 AM | Updated on Jun 19 2025 7:52 AM

బస్‌

బస్‌ పాస్‌ చార్జీలు తగ్గించాలి

షాద్‌నగర్‌: బస్‌ పాస్‌ల ధరలు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పవన్‌ చౌహాన్‌ అన్నారు. పెంచిన 20శాతం చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం డిపో మేనేజర్‌ సుధాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. విద్యార్థి నాయకులు ఆకాశ్‌, రాహుల్‌, శ్రీను పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ కోసం బీఆర్‌ఎస్‌ ధర్నా

ఆమనగల్లు: వ్యవసాయానికి కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం పలువురు రైతులతో కలిసి గట్టుప్పలపల్లి సబ్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం కురిసినా, గాలివీచినా గంటల తరబడి సరఫరా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటయ్య, కృష్ణయ్య, రాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

షాబాద్‌: సమాచార కమిషనర్‌గా నియమితులైన పీవీ శ్రీనివాస్‌కు పలువురు జర్నలిస్టులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ మల్లారెడ్డి బుధవారం ఆయనను కలిసి పూలబొకే అందజేశారు.

గడ్డమల్లయ్యగూడలో ఐఈఎస్‌ అధికారుల పర్యటన

యాచారం: ఐఈఎస్‌(ఇండియన్‌ ఎకనామికల్‌ సర్వీస్‌) అధికారుల బృందం బుధవారం గడ్డమల్లయ్యగూడలో పర్యటించింది. ఈజీఎస్‌ నిధులతో గ్రామంలో చేపట్టిన డంపింగ్‌ యార్డ్‌, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, పంచాయతీ భవనాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, గ్రామ పాలనపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మాధవరావు, ఎంపీడీఓ బాలశంకర్‌, ఎంపీఓ శ్రీలత, ఈజీఎస్‌ ఏపీఓ లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

‘శిల్పా’ ఫ్లై ఓవర్‌కు పీజేఆర్‌ పేరు

28న ప్రారంభించనున్న

సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: కొండాపూర్‌ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్‌ చిక్కులు తొలగించేందుకు నిర్మించిన శిల్పా లేఔట్‌–2 ఫ్లై ఓ వర్‌ను ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఎర్‌) జ్ఞాపకార్థం ఈ ఫ్లైఓవర్‌కు పీజేఆర్‌ పేరు పెట్టాలని సీఎం సూచించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముందే పెయింటింగ్‌, సుందరీకరణలతో సహా అన్ని పనులను పూర్తి చేయాలని మేయర్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ను ఆదేశించారు. నగర పౌరులకు ప్రయోజనం చేకూర్చే నాణ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించడానికి జీహెచ్‌ఎంసీ కట్టుబడి ఉందని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

బస్‌ పాస్‌ చార్జీలు తగ్గించాలి   
1
1/1

బస్‌ పాస్‌ చార్జీలు తగ్గించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement