
వ్యవసాయ కార్యాలయం వద్ద రైతుల సందడి
దరఖాస్తులు స్వీకరించిన ఏఈఓలు
చేవెళ్ల: ప్రభుత్వం వానాకాలం సాగుకు రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో కొత్తగా పాస్పుస్తకాలు తీసుకున్న రైతులు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో రైతులు వ్యవసాయ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. మంగళవారం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతుల హడావుడి కనిపించింది. వ్యవసాయ కార్యాలయంలో ఏఈఓలు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ నిర్వహించారు. యాసంగి సీజన్లో భరోసా అందని రైతులు సైతం దరఖాస్తులు సమర్పించారు. కొత్త వారికంటే పాత రైతులు రాని వారే ఎక్కువగా వస్తుండటంతో ఏఈఓలకు రైతులకు సమాధానం చెప్పడమే సరిపోయింది. దీనికి తోడు సర్వర్ మొరాయించడంతో ఎంట్రీలు ఆలస్యమయ్యాయి.