
మంత్రి వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు
షాద్నగర్ః క్రీడలు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమ వారం మంత్రి బాధ్యతల స్వీకరణోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు.
మంత్రిని కలిసిన డీసీసీబీ చైర్మన్
తుర్కయంజాల్: మంత్రి వాకిటి శ్రీహరిని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సరైన చికిత్సతో టీబీ నిర్మూలన
మీర్పేట: సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాంతకమైన టీబీ వ్యాధి నుంచి బయటపడొచ్చని జిల్లా ప్రోగ్రాం అధికారి పాపారావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లెలగూడలోని మీర్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇతర అంటు వ్యాధుల కంటే టీబీ మరణాలే అధికంగా నమోదవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందని తెలిపారు. ప్రజల్లో టీబీ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పలువురికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి బాలమణి, మీర్పేట కమిషనర్ జ్ఞానేశ్వర్, సూపర్వైజర్లు కమలకుమారి, రాజేందర్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు అజయ్, సైదులు, రవీందర్రెడ్డి, ఏఎన్ఎం కవిత, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విచారణకు హాజరైన పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
షాద్నగర్: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం షాద్నగర్కు పాకింది. ఇందులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ అధికారులు లోతుగా విచారిస్తు న్నారు. ఈకేసులో బాధితుల జాబితాను సిద్ధం చేసి, విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా షాద్నగర్కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డిని సోమ వారం నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విష్ణువర్ధన్రెడ్డి సింహం గుర్తుపై పోటీ చేశారు. ఈసమయంలో కలిగిన ఇబ్బందులు, నమోదైన కేసుల వివరాలను అడిగారని విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 15 నుంచి 30 తేదీ వరకు తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల వద్ద వివరాలు ఉన్నాయన్నారు.
మెట్రోరైల్కు రైల్వే సేఫ్టీ ఎక్సలెన్సీ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్కు ప్రతిష్టాత్మక రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈనెల 13న న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ ఇన్ఫ్రా రైల్ షో–2025లో అవార్డు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేలతో మెట్రో రైళ్లకు ప్రతిసంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. భద్రత, సుస్థిరత, సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణలు, అర్బన్ కనెక్టివిటీలో అగ్రగాములుగా నిలుస్తూ, దేశీయంగా రైల్ ఆధారిత మొబిలిటీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సంస్థలుగా మెట్రోలను పరిగణిస్తూ ఈ పురస్కారాలను ఇస్తారు.

మంత్రి వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు

మంత్రి వాకిటి శ్రీహరికి శుభాకాంక్షలు