తల్లిపేరున మొక్క నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిపేరున మొక్క నాటి సంరక్షించాలి

Jun 17 2025 6:55 AM | Updated on Jun 17 2025 6:55 AM

తల్లిపేరున మొక్క నాటి సంరక్షించాలి

తల్లిపేరున మొక్క నాటి సంరక్షించాలి

చేవెళ్లః తల్లిపేరున ప్రతి ఒక్కరూ మొక్క నాటి సంరక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని మల్కాపూర్‌లో సోమవారం పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివాలయం ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పిలుపు మేరకు తల్లిపేరున ఒక మొక్క నాటి దానిని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, నాయకులు డాక్టర్‌ మల్గారి వైభవ్‌రెడ్డి, అంజనేయులుగౌడ్‌, శర్వలింగం, ఎ.శ్రీనివాస్‌, ఇంద్రసేనారెడ్డి, కృష్ణగౌడ్‌, విఠలయ్య, సత్యనారాయణ, భూజంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

షాబాద్‌: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీశ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌ ఆవరణలో సోమవారం మొక్క నాటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంచర్ల ప్రకాష్‌, మండల అధ్యక్షుడు మాణెయ్య, జిల్లాఅధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మహేందర్‌, బీజేవైఎం రాష్ట్ర స్వచ్ఛ భారత్‌ సెల్‌ కన్వీనర్‌ రాము పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement