సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సిద్ధం

Apr 3 2025 7:50 PM | Updated on Apr 3 2025 7:50 PM

సిద్ధ

సిద్ధం

గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
విత్తన పండుగకు

8లోu

కడ్తాల్‌: తెలంగాణ తొలి విత్తన పండుగకు మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్‌ సెంటర్‌ ముస్తాబవుతోంది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌, భారత బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌ సంయుక్త ఆధ్వర్యంలో విత్తన పండుగ నిర్వహించనున్నారు. ఆరోగ్యానికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. దేశీ విత్తనాల ప్రదర్శన, ఉచిత పంపిణీ, విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, పాలసీ మేకర్స్‌ని ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు, పాలసీ మేకర్స్‌ పెద్ద ఎత్తున తరలిరానున్నారని వారు వివరించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కలెక్టర్‌ నారాయణ రెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహా రెడ్డి, పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, సాయి ప్రభాకర్‌ రెడ్డి, ఉమా మహేశ్వర్‌ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు.

విత్తన పండుగ లక్ష్యాలు

● విత్తనాలను భద్రపరచడం, ఉపయోగించడం, పంచుకోవడం, ఒక ఉద్యమంగా చేయడం.

● విత్తనాలను గుర్తించడంలో, దాచుకోవడంలో, పెంపొందించుకోవడంలో స్థానికుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.

● మన వృక్ష జాతులు, జంతు జాతులను కాపాడుకోవడంతో పాటు, వాటికి సంబంధించిన సహజ సాంస్కృతిక పద్ధతులను సంప్రదాయాలను గౌరవించుకోవడం.

● రైతులు, ఆదివాసులు, అటవీ ప్రజలు, కొండ ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తదితర జీవనోపాధులతోపాటు భవిష్యత్‌ తరాల విత్తన హక్కులను కాపాడుకోవడం.

● స్థానిక ప్రజల అవసరాలు, ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైవిద్య, అటవీ సంరక్షణకు తోడుగా ఉండటం.

● సహజ సంపదను కాపాడుతూ, పరిపుష్టికి ప్రయత్నాలు చేస్తూ, స్థిరమైన జీవనోపాధులు, సంప్రదాయ జ్ఞానాన్ని కొనసాగించడం.

● స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతు ప్రకృతి అనుకూల విత్తన విధానాల కోసం కలిసికట్టుగా పనిచేయడం.

సదస్సు ప్రత్యేకత

● వివిధ పంటలకు సంబంధించి రకరకాల సంప్రదాయ విత్తన జాతుల ప్రదర్శన.

● రైతులు, విత్తన సంరక్షకులు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలతో నేరుగా మాట్లాడే అవకాశం.

● పోస్టర్లతో, డాక్యుమెంట్లతో, ఫొటోగ్రాప్స్‌తో ప్రదర్శన.

● ప్రముఖ వ్యవసాయ రంగ, పర్యావరణరంగ నిపుణుల ప్రసంగాలు, ప్రదర్శనలు, వర్క్‌షాపులు, సెమినార్లు.

● పుస్తకాలు, ప్రకృతి అనుకూల ఉత్పత్తులు, సంప్రదాయ కళలు, హస్త కళా ప్రదర్శన, విక్రయాలు.

● విత్తనాలు ఇచ్చి పుచ్చుకోవడం, పంచుకోవడం.

● స్వదేశీ, అటవీ, సేంద్రియ రసాయన రహిత ఆహారం అందుబాటులో ఉంచడం.

● సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, పాటలు, గిరిజన నృత్యాలు.

న్యూస్‌రీల్‌

ముస్తాబవుతున్న అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్‌సెంటర్‌

రేపటి నుంచి మూడురోజుల పాటు వేడుకలు

దేశంలోని పలు రాష్ట్రాల దేశీ విత్తనాల ప్రదర్శన

తరలిరానున్న వ్యవసాయ నిపుణులు, పాలసీ మేకర్స్‌

ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

సిద్ధం 1
1/1

సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement