ఘనంగా గరుడ వాహన సేవ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గరుడ వాహన సేవ

Mar 31 2025 12:48 PM | Updated on Apr 1 2025 10:48 AM

ఘనంగా గరుడ వాహన సేవ

ఘనంగా గరుడ వాహన సేవ

కొడంగల్‌: పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వైఖానస ఆగమ శాస్త్రోకంగా తిరుమల తరహాలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటలకు భూదేవి శ్రీదేవి సమేతంగా గరుడ వాహనంపై ఆసీనులైన శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. జాతర స్థలం వరకు కొనసాగిన ఈ ఊరేగింపు ఆద్యంతం గోవింద నామస్మరణతో కొనసాగింది. అర్ధరాత్రి వేంకటేశ్వరస్వామి జాతర స్థలంలో లంకా దహన కార్యక్రమం వైభవంగా జరిగింది. టపాసులు వెలుతురులు ఆకాశంలో కనువిందు చేశాయి. చైన్నె నుంచి ప్రత్యేకంగా తెప్పించిన టపాసులతో లంకాదహనం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement