సిరిసిల్లటౌన్: జిల్లాలో పెద్ద ఎత్తున సాగి ధాన్యం కొనుగోలు స్కాంలో అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మజీద్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తే కొందరు సిబ్బంది భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ ధాన్యం కుంభకోణంలో ఎంత పెద్ద వ్యక్తుల పాత్ర ఉన్నా వదిలిపెట్టొద్దని కోరారు. నాయకులు కదిరే భాస్కర్, సయ్యద్ జావిద్, ఒర్సు అశోక్, బైరి రాజే శ్, సయ్యద్ మౌలా, తోట కనకయ్య, అంతర్పుల బాబు, బండి శ్రీహరి, మండేపల్లి రవి పాల్గొన్నారు.


