భగీరథ నీటి సరఫరాకు ఇబ్బందులు లేవు. నిత్యం నీటిని శుద్ధిచేసి, క్లోరినేషన్ చేసి సరఫరా చేస్తున్నాం. శుద్ధిచేసిన నీటిని రోజూ ల్యాబ్లో పరీక్షలు చేస్తున్నాం. మధ్యమానేరులో కొద్దిగా నీటి నిల్వలు తగ్గినా సరఫరాకు ఇబ్బంది లేదు. నల్లా నీరు రంగుమారి రావడానికి ఆయా ప్రాంతాల్లో ఏమైనా పైపులైన్ లీకేజీలు కారణం కావచ్చు. ఇటీవల రంగు మారి నీరు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. నీటిని శుద్ధి చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– ఎండీ ముజాహిద్ అన్వర్,
మిషన్ భగీరథ ఈఈ, సిరిసిల్ల


