ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లె గ్రామంలో పొలంలో ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సలేంద్రి మల్ల య్య(65) అనే వృద్ధుడు మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 5న ఇంటిలో నుంచి వెళ్లిన మల్లయ్య బుధవారం ఉదయం పాపయ్యపల్లెలోని ఓ రైతు పొలంలోని బురదలో పడి మృతిచెంది కనిపించాడు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా సోషల్ మీడియాలో పోలీసులు పోస్టు చేయగా సిరిసిల్లకు చెందిన వాడిగా ఆచూకీ లభించింది. దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
ట్రాక్టర్పై నుంచి పడి వ్యక్తి..
బోయినపల్లి: మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య (48)ట్రాక్టర్పై నుంచి పడి మృతిచెందినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన దేవయ్య ఇసుక రవాణా అనుమతులతో డ్రైవర్ సాయంతో ఇసుక జారవేస్తాడు. వెంకట్రావుపల్లిలో బైక్ పెట్టి ఇల్లంతకుంట మండలం కందికట్కూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వేణుతో కలిసి కొదురుపాకలో ఇసుక ట్రిప్ పోసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా వెంకట్రావుపల్లి వద్ద ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం దేవయ్యను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మేళ్ల నారాయణ(64) అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ కొంత కాలంగా కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఉరేసుకొని వ్యక్తి..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్కు చెందిన సుధగోని పరశురాములు (48) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీత కార్మికుడిగా పనిచేస్తున్న పరశురాములు ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం పాలవడంతో మానసికంగా కృంగిపోయి బాత్రూంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య మంగవ్వ, కూతురు, కొడుకు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి


