
క్రీడా ప్రాంగణం పరిశీలన
చందుర్తి(వేములవాడ): క్రికెట్ స్టేడియం ఏర్పాటు కోసం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిశీలించారు. ఈనెల 20న ఎస్ఏటీజీ చైర్మన్ శివసేనరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి శ్రీధర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన ఏఎంసీ చైర్మన్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కలెక్టర్గా సందీప్కుమార్ ఝా ఏడాది సక్సెస్ ఫుల్గా నిలిచారని ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం అన్నారు. బుధవారం కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు తదితరులున్నారు.