
మహిళలకు రైస్మిల్ ఏర్పాటుకు సహకరిస్తాం
వేములవాడరూరల్: మహిళలు ముందుకొస్తే రైస్మిల్లు ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వట్టెంల, ఫాజుల్నగర్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్లు తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రతీ క్వింటాల్పై అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, పార్టీ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ పర్శరాములు, బొడ్డు రాములు, ఏపీఎం చంద్రయ్య పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్