
రవాణాశాఖ ఆదాయం రూ.39.25కోట్లు
● జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్
సిరిసిల్ల: జిల్లాలో రవాణాశాఖ 2024–2025 ఆర్థిక సంవత్సరంలో రూ.39.25కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చిందని జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్ శనివారం తెలిపా రు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 నాటికి రవాణాశాఖ ద్వారా రూ.39.25కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ట్రాన్స్పోర్టు వాహనాల ద్వారా మూడు నెలలకో సారి చెల్లించే పన్నులు రూ.6.78కోట్లు, లైఫ్ ట్యాక్స్ రూపంలో రూ.22.57కోట్లు, సర్వీస్ చార్జీల ఫీజు లుగా రూ.1.40కోట్లు, వివిధ రకాల ఫీజులుగా రూ.4.68కోట్లు, గ్రీన్ట్యాక్స్లుగా రూ.53 లక్షలు, డిటెక్షన్ రూపంలో మరో రూ.1.43 కోట్లు, జరిమానాలు, ఎన్ఫోర్స్మెంట్ కాంపౌండింగ్ ఫైన్లు రూ.1.84కోట్లు వచ్చాయని వివరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
సిరిసిల్లటౌన్: ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయలలాని బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ కోరారు. స్థానిక తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దారుణమన్నారు. గురుకుల భవనాలకు కనీసం అద్దె చెల్లించకుండా తాళాలు వేసే దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మట్టె శ్రీనివాస్, సామల శ్రీకాంత్, ఆదిచెర్ల సాయి, కాసర్ల వినయ్, మ్యాన కృష్ణ, కొండి నవీన్, రాపెల్లి భాను, కస్తూరి అజ్జు, సాయి, గణేష్ పాల్గొన్నారు.