
పవనసుత హనుమాన్కీ..
వేములవాడఅర్బన్: పవనసుత హనుమాన్ కీ.. జై.. భజరంగ్ భళీకి జై.. అనే నామస్మరణలతో అగ్రహారం ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాలధారులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయస్వామి సన్నిధిలో జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగు..రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎండ నుంచి భక్తులకు ఉపశమనం కల్గించేందుకు చలువపందిళ్లు వేశారు.
దీక్షలకు ప్రత్యేకం
వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయస్వామి ఆలయంలో మూడు దఫాలుగా మాలలు ధరిస్తారు. మండల దీక్ష 41 రోజులు, అర్ధ మండల దీక్ష 21 రోజులు, ఏకాదశ దీక్ష 11 రోజులు ధరిస్తారు. ప్రతీరోజు హనుమాన్ ఆలయం దీక్షాపరుల భజనలతో సందడిగా ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి
ఆలయాన్ని విద్యుత్ దీపాలు అలంకరించారు. భక్తులకు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. 10 క్వింటాళ్ల అన్నదానం చేయనున్నారు. 14 వేల లడ్డూ ప్రసాదాలు, 3 క్వింటాళ్ల పులిహోర తయారు చేయనున్నట్లు తెలిపారు.
సాయంత్రం రథోత్సవం
స్వామివారి రథోత్సవం సాయంత్రం నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తిని రథంపై ఆసీనులను చేసి ఊరేగిస్తారు. దాదాపు 40వేల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు.
నేడు హనుమాన్ జయంతి
ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు
ఆలయానికి చేరుకున్న మాలధారులు
ఏర్పాట్లు చేస్తున్నాం
అగ్రహారం హనుమాన్ ఆలయంలో జరిగే జయంతి, రథోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదానం, తాగునీటి వసతి కల్పిస్తున్నాం. లడ్డూ ప్రసాదాలు తయారు చేయిస్తున్నాం.
– నాగారపు శ్రీనివాస్,
హనుమాన్ ఆలయ ఈవో

పవనసుత హనుమాన్కీ..

పవనసుత హనుమాన్కీ..