గెలవాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

గెలవాల్సిందే..

Mar 24 2025 6:07 AM | Updated on Mar 24 2025 6:07 AM

గెలవా

గెలవాల్సిందే..

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

13 అసెంబ్లీ

స్థానాలు

మధ్యాహ్న కార్మికుల నిలువు దోపిడీ

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వహకులైన కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తోందని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్‌ విమర్శించారు. గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మూడు మండలాల కార్మికులు ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్‌ ఎదుట ఆందోళనకు దిగారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.10వేల జీతాన్ని ఇస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయలేదన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.30చొప్పున, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. భోజన నిర్వహణ కమిటీ ప్రతినిధులు మణెమ్మ, బొడ్డు నర్సమ్మ, భాగ్య, గంగవ్వ, దేవలక్ష్మి, జ్యోతి, లక్ష్మి, మల్లవ్వ, బాలమణి, రేఖ, మహేశ్వరి పాల్గొన్నారు.

ఉద్యమకారులకు స్వాగతం

వేములవాడఅర్బన్‌: వేములవాడ మున్సిపల్‌ పరిధి తిప్పాపూర్‌లోని తెలంగాణచౌక్‌ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య బస్సుయాత్రకు ఉద్యమ కళాకారులకు రాష్ట్ర కన్వీనర్‌ యెల్ల పోశెట్టి ఆదివారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి, మొక్కులు చెల్లించుకున్నారు. ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనకయ్య, బొడ్డు రాములు, శ్రీనివాస్‌, వారాల దేవయ్య, హనుమాన్‌, శంకరయ్య, నారయణ, చందు, రాజేశం, లక్ష్మీనారాయణ, రమేశ్‌ తదితరులు ఉన్నారు.

ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలి

సిరిసిల్లటౌన్‌: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్‌ చీమ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ..చేపట్టిన చైతన్య యాత్ర ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరింది. ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, రూ.26వేలు పెన్షన్‌ అమలు చేయాలని కోరారు. ఏప్రిల్‌ 21న సికింద్రాబాద్‌లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వెంగళ శ్రీనివాస్‌, గోనె ఎల్లప్ప, కుసుమ విష్ణు, ఐలయ్య, లక్ష్మణ్‌, వెంకటేశ్‌, శంకర్‌, గంగరాజం పాల్గొన్నారు.

శాకాహారంతో శాంతియుత సమాజం

సిరిసిల్లకల్చరల్‌: శాకాహారంతోనే మానవ సమాజంలో సాధు జీవనం సాధ్యమవుతోందని పిరమిడ్‌ స్పిరిచువల్‌ సొసైటీస్‌ మూమెంట్‌ రాష్ట్ర బాధ్యుడు విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మూమెంట్‌ స్థానిక శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అనాగరిక సమాజం నుంచి ఆధునిక నాగరికత వైపు మనిషి పురోగమిస్తున్నా మాంసాహారం తీసుకోవడంతో అశాంతి చెలరేగుతోందన్నారు. జంతుహింసతో ప్రకృతి సమతూకం కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాకాహారం తీసుకోవడం ద్వారా సమాజం శాంతియుతంగా పరిణామం చెందుతోందన్నారు. దాదాపు 1200 మంది శాకాహారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేముల యాదగౌడ్‌, మల్యాల కళావతి, జక్కని భూపతి, చిక్కుడు రాజయ్య, జక్కని శివప్రసాద్‌, బొల్లి సురేశ్‌, గుడ్ల పావని, సామల గీత, లక్ష్మక్క, బల్యాల రాజు, గడ్డం మనోజ్‌, గడప శారద, సుజాత, కోళ్ల లక్ష్మి, పాల్గొన్నారు.

25న సాహిత్య సమాలోచన సదస్సు

సిరిసిల్లకల్చరల్‌: రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ సౌజన్యంతో మానేరు రచయితల సంఘం, అ గ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా 25, 26 తేదీల్లో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.శంకర్‌ తెలిపారు. బహుభాషావేత్త డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం సాహిత్యంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

జతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. బీఆర్‌ఎస్‌ హయాంలో వివిధ వర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టా నం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తార ని వెల్లడించారు. కేసీఆర్‌కు కరీంనగర్‌ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదుమాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు.

చెక్‌పోస్టులు పెట్టి మరీ: గంగుల

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక చెక్‌పోస్టులు పెట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మానేరు రివర్‌ ఫ్రంట్‌, తీగల బ్రిడ్జి వంటి ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్‌ను అడిగితే.. కాంగ్రెస్‌ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్‌పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు.

ఒక తరాన్ని పరిచయం చేశారు

బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్‌లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. పకేసీఆర్‌ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. శ్రీఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్‌ లీడర్‌గా ఎదిగారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్‌ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్‌ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌, కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, కోరుకంటి చందర్‌, మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్‌, నాయకులు రాజేశంగౌడ్‌, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, దావ వసంత, రాకేశ్‌, తుల ఉమ, కోలేటి దామోదర్‌, హరీశ్‌ శంకర్‌, పొన్నం అనిల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

జోష్‌నింపిన బైక్‌ ర్యాలీ

అంతకుముందు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్‌ రోడ్డులోని వీ కన్వెన్షన్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్‌ రాకతో బీఆర్‌ఎస్‌ నాయకుల్లో కొత్త జోష్‌ నిండింది.

ప్రతిపాదనలు కాదు.. పరిహారం ఇవ్వండి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయడం కాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్‌ చేశారు. ముస్తాబాద్‌ మండలం బందనకల్‌, వెంకట్రావుపల్లి, మొర్రాపూర్‌ తండాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమాను అమలు చేయాలన్నారు. అంజాగౌడ్‌, రమేశ్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, నరేశ్‌, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్‌, క్రాంతి, మహేందర్‌, శంకర్‌, కార్తీక్‌, కృష్ణ ఉన్నారు.

వడగళ్లతో 500 ఎకరాల్లో నష్టం

సర్వే చేపట్టిన వ్యవసాయాధికారులు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలో వడగళ్ల వానతో 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. బందనకల్‌, వెంకట్రావుపల్లి, మల్లాపూర్‌తండాల్లో శనివారం రాత్రి కురిసిన వడగళ్లవానతో సుమారు 500 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆదివారం మూడు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధాన్యం రాలిపోయిన పంటల వివరాలను సేకరించి రైతుల పేర్లను నమోదు చేసుకున్నట్లు ఏఈవో రేవతి తెలిపారు.

శ్రీనగర్‌ కాలనీలో మురికి కాల్వను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల: చెత్తను, మురికి కాల్వలను నిత్యం శుభ్రం చేయాలని, సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌ కమాన్‌ వద్ద డ్రెయినేజీని, శ్రీనగర్‌కాలనీ, పద్మనగర్‌, కొత్తచెరువు ప్రాంతాలను ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మురికి కాల్వల్లో ఎక్కడా నీరు నిలవకుండా వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురికి నీరు వెళ్లేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పద్మనగర్‌లోని మురికినీటి శుద్ధి(ఈటీపీ) ప్లాంట్‌ను పరిశీలించారు. కొత్తచెరువు వద్ద పరిసరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెత్తా చెదారం, గడ్డి వ్యర్థాలు తొలగించాలని, నాలాలోని పూడిక తొలగించాలని, మురుగునీరు నిలిచిన ప్రదేశాల్లో ఆయిల్‌బాల్స్‌, పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.

పందులు కనిపించ వద్దు

పందుల పెంపకం కోసం ఐదెకరాలు ఇచ్చామని.. అయినా పట్టణంలో ఎందుకు కనిపిస్తున్నాయని మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కాలనీలో పర్యటించగా.. డ్రెయినేజీ సమస్యను స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనగర్‌కాలనీలో నిర్మించే రోడ్డు మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేసి, మొక్కలు పెట్టించాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ ముడపు శ్రీదేవి, మున్సిపల్‌ పర్యావరణ ఇంజినీరు రఘు, సానిటరీ అధికారులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

కాంగ్రెస్‌ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సిరిసిల్ల: పదిహేను నెలల కాంగ్రెస్‌ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, మళ్లీ వచ్చేది కేసీఆర్‌ పాలనే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీవైనగర్‌ షాదీఖానాలో రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ పండుగ సందర్భంగా పేదలకు అందించే రంజాన్‌ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్‌ కానుకలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఆటోడ్రైవర్లు, చిరువ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉండగా.. ఓ భరోసా ఉండేదన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉండగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి 1.40 లక్షల మంది ముస్లిం పిల్లలకు చదువు చెప్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లౌకికపాలన అందించిందన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు జిందం కళాచక్రపాణి, గూడూరి ప్రవీణ్‌, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్‌, ఏనుగు మనోహర్‌రెడ్డి, సిద్దం వేణు, రాఘవరెడ్డి, జక్కుల నాగరాజు, బండ నర్సయ్యయాదవ్‌, చంద్రయ్యగౌడ్‌, మజీద్‌ కమిటీ అధ్యక్షుడు స య్యద్‌ షమీ, ముస్లిం పెద్దలు యూసుఫ్‌, సలీం, సత్తార్‌, అక్రమ్‌, ఫయాజ్‌, చాంద్‌పాషా, సోహెల్‌ తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం నాయకులు ఘర్షణ

ఇఫ్తార్‌ విందు సందర్భంగా షాదీఖానాలో ముస్లిం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కేటీఆర్‌ వేదికపైకి రాగానే సత్తార్‌, సోహెల్‌, చాంద్‌పాషాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్‌ సమక్షంలో ఇరువర్గాలు గొడవకు దిగడంతో తోపులాట జరిగింది. కేటీఆర్‌ జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. ఇటీవల మజీద్‌ కమిటీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండు వర్గాలుగా ముస్లింలు చీలిపోయి ఈ ఘటనకు దారితీసింది.

ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌

చెక్‌పోస్టులు పెట్టి కాంగ్రెస్‌ లీడర్లు దోచుకుంటున్నారు: గంగుల

ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు: ఈశ్వర్‌

కేసీఆర్‌ ఒక తరాన్ని పరిచయం చేశారు: వినోద్‌కుమార్‌

జోష్‌ నింపిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ర్యాలీ, సమావేశం

సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి

పందులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

ఉద్యమ వ్యతిరేకి చేతిలో..

ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటా రో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సా ధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్‌ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సి న బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు.

గెలవాల్సిందే..1
1/7

గెలవాల్సిందే..

గెలవాల్సిందే..2
2/7

గెలవాల్సిందే..

గెలవాల్సిందే..3
3/7

గెలవాల్సిందే..

గెలవాల్సిందే..4
4/7

గెలవాల్సిందే..

గెలవాల్సిందే..5
5/7

గెలవాల్సిందే..

గెలవాల్సిందే..6
6/7

గెలవాల్సిందే..

గెలవాల్సిందే..7
7/7

గెలవాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement