ఉసురు తీసిన సరదా..
● రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
కనిగిరి రూరల్: సరదాగా చేసిన ప్రయాణం ఓ పదో తరగతి విద్యార్థి ఉసురు తీసింది. శనివారం కనిగిరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన విద్యార్థులు వారి స్నేహితులతో కలిసి సరదాగా మూడు బైకులపై పట్టణ సమీపంలోని కలగట్ల వద్ద నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్ను చూసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కలగట్ల–కనిగిరి మధ్యలో మలుపు వద్ద ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో పట్టణంలోని ఏబీఎం గ్రౌండ్కు చెందిన విజయ్ కుమారుడైన పదో తరగతి విద్యార్థి కుడుముల ప్రతాప్ (15), మరో విద్యార్థి బీ అనీశ్కు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రతాప్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనీశ్కు చెయ్యి విరగడంతో చికిత్స చేస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


