200 బత్తాయి చెట్లు నరికివేత | - | Sakshi
Sakshi News home page

200 బత్తాయి చెట్లు నరికివేత

Jun 19 2025 7:46 AM | Updated on Jun 19 2025 7:46 AM

200 బత్తాయి చెట్లు నరికివేత

200 బత్తాయి చెట్లు నరికివేత

పామూరు: వివాదంలో ఉన్న పొలంలో బత్తాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు కూకటి వేళ్లతో సహా పెకిలించారు. ఈ సంఘటన పామూరు మండలంలోని గుమ్మనంపాడులో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు అబ్బూరి శేషయ్య బత్తాయి తోట సాగుచేస్తున్న పొలంపై వివాదం నెలకొంది. బుధవారం ఉదయం బత్తాయి చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్లగా సుమారు 200కు పైగా బత్తాయి చెట్లను జేసీబీతో పెకలించి, సోలార్‌ ప్యానళ్లు, ఫెన్సింగ్‌ ధ్వంసం చేశారు. దీంతో నిశ్చేష్టుడైన శేషయ్య చీమకుర్తికి చెందిన వ్యక్తిపై అనుమానంగా ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.కిషోర్‌బాబు తెలిపారు.

‘ఆడుదాం ఆంధ్ర’ బిల్లుల తనిఖీ

గిద్దలూరు రూరల్‌: గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన బిల్లులను విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గిద్దలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సోదాల అనంతరం రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాల పంచాయతీ కార్యదర్శులు, గిద్దలూరు మున్సిపల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర రికార్డులు, ఖర్చు చేసిన బిల్లులను అధికారుల నుంచి సేకరించారు.

సోలార్‌ ప్యానళ్లు, ఫెన్సింగ్‌ ధ్వంసం

పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement