
కోత మిల్లులో భారీ అగ్నిప్రమాదం
దర్శి (కురిచేడు): దర్శి నగర పంచాయతీ పరిధి పుచ్చలమెట్టలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర టింబర్ డిపోకు మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూటై రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగింది. టేకు చెక్కలు, విద్యుత్ పరికరాలు, కాలి బూడిదయ్యాయి. టింబర్ డిపో యజమాని మారం శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం..
మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో ఇంట్లో నిద్రపోతున్న శ్రీనివాసరెడ్డికి స్థానికులు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి వచ్చి చూసేసరికి భారీగా మంటలు వ్యాపించి టింబర్ డిపోలో మొత్తం పొగ కమ్ముకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాహనం వచ్చి మంటలు అదుపు చేసింది. టింబర్ డిపోలో ఉన్న టేకు కర్రలు, ఇతర సామగ్రితో పాటు మిషనరీలు, ఇతర విద్యుత్ పరికరాలు, యంత్రాలు కాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు.
రూ.40 లక్షల ఆస్తి నష్టం కాలిబూడిదైన టేకు చెక్కలు, ఇతర సామగ్రి

కోత మిల్లులో భారీ అగ్నిప్రమాదం