కనిగిరి రూరల్/కొమరోలు: కనిగిరి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు పిడుగులు పడ్డాయి. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉదయం 6.30 గంటల సమయంలో మండలంలోని పోలవరం పంచాయతీ కలగట్ల సమీప పొలాల్లో నూకతోటి శివపార్వతమ్మకు చెందిన గొర్రెల మంద దొడ్డిపై పిడుగు పడింది. దీంతో 20 మేకలు మృతి చెందాయి. సుమారు రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలాన్ని పశు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అంకమ్మరాజు పరిశీలించారు.
కొమరోలు మండలంలో..
కొమరోలు మండలంలో గురువారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తాటిచెర్ల మోటు గ్రామంలో పిడుగు పడటంతో రెండు గేదెలు, రెండు దూడలు మృతిచెందాయి. రూ.3 లక్షల విలువైన పశువులు మృత్యువాత పడ్డాయని బాధిత రైతు గుమ్మళ్ల శింగరయ్య కన్నీటి పర్యంతమయ్యాడు.
మిద్దైపె నుంచి పడి వృద్ధురాలు..
పని నిమిత్తం మిద్దైపెకి ఎక్కిన ఓ వృద్ధురాలు బలమైన ఈదురు గాలుల ధాటికి కిందపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సర్విరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గుడిమి సుశీలమ్మ(70) కుటుంబ సభ్యులతో కలిసి కొమరోలులోని గీతామందిరం వద్ద సొంత ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటోంది. గురువారం రాత్రి వర్షం మొదలయ్యే తరుణంలో మిద్దైపె ఆరబెట్టిన పసుపు కొమ్ములు తెచ్చేందుకు వెళ్లింది. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో అదుపుతప్పి మిద్దైపె నుంచి కిందపడింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుశీలమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుశీలమ్మకు భర్త, 8 మంది సంతానం ఉన్నారు.
కనిగిరి మండలంలో 20 మేకలు మృతి
కొమరోలు మండలంలో 2 గేదెలు, 2 దూడలు మృతి
రెండు ఘటనల్లో బాధితులకు రూ.8 లక్షల మేర నష్టం
ఈదురు గాలుల ధాటికి మిద్దైపె నుంచి పడి మరణించిన వృద్ధురాలు
పిడుగుల వానకు మూగజీవాలు బలి
పిడుగుల వానకు మూగజీవాలు బలి