వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది... | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది...

Jul 2 2023 12:12 PM | Updated on Jul 2 2023 12:17 PM

ఎస్సై రామకృష్ణ - Sakshi

ఎస్సై రామకృష్ణ

ప్రకాశం: పట్టణంలో శుక్రవారం ఉదయం తల్లీకూతుళ్లపై జరిగిన హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని స్థానిక ఎస్సై రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. దర్శికి చెందిన పెద్దిశెట్టి సాయిరాం అలియాస్‌ వెంకటప్రభు శేషసాయి స్థానికంగా నివాసం ఉంటున్న గోవిందమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి గోవిందమ్మతో పాటు ఆమె కుమార్తె ప్రసన్నను తిడుతూ కొడుతూ ఉన్నాడు. ఇంటికి రావద్దని వారు చెప్పినా వినకుండా వేధిస్తున్నాడు. తన తల్లిని బాధపెట్టడాన్ని భరించలేకపోయిన ప్రసన్న.. ఇంకోసారి ఇంటికి వచ్చి తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతామని హెచ్చరించింది.

గోవిందమ్మతో తన వివాహేతర సంబంధానికి ప్రసన్నను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నిన సాయిరాం.. శుక్రవారం ఉదయం ఇంటి బయట మంచంపై పడుకుని ఉన్న ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది చనిపోయిందని భావించి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement