12 మరణాలు ప్రభుత్వ హత్యలే.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | KTR Serious Comments Over Congress Govt | Sakshi
Sakshi News home page

12 మరణాలు ప్రభుత్వ హత్యలే.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Jul 22 2024 8:13 AM | Updated on Jul 22 2024 8:16 AM

KTR Serious Comments Over Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇదే సమయంలో రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘కాంగ్రెస్ పాలనలో చితికిన చేనేతరంగం.. కార్మికుల హాహాకారం మిన్నంటింది. రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం కొనసాగుతో​ంది. గడిచిన 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్‌ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది.

మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు చేతిలో పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటక్కెక్కించడంతో చేనేతరంగం చితికిపోయింది. రాష్ట్ర వస్త్ర శాఖ కుదేలు కావడంతో సాంచాలను తుక్కుకింద అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. 

 

 

ఇటు పనుల్లేక.. అటు కుటుంబాలను పస్తులుంచలేక.. మరోవైపు అప్పులు తీర్చే దారిలేక ఏడు నెలల్లోనే 12 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను కండ్లకు కడుతున్నది. చేనేత రంగంలో మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి దారుణ పరిస్థితులు వచ్చాయని కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement