TS:అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్‌ | KTR Sensational Comments On Revanth Reddy's Government - Sakshi
Sakshi News home page

అసలు ఆట ఇప్పుడుంది: కేటీఆర్‌

Dec 13 2023 12:54 PM | Updated on Dec 13 2023 1:32 PM

Ktr Sensational Comments On Revanthreddy Governament - Sakshi

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌​, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని విమర్శించారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.

మీడియా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు అంశాలపై స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దుల మీద చర్చ జరగలేదు. మేం చర్చ జరిపాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని వల్లె వేయిస్తారు’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

‘ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది? మొదటి మంత్రి వర్గంలోనే  ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

ఇదీచదవండి..హైదరాబాద్‌ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి: డ్రగ్స్‌పై వారికి వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement