
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో ఎల్లో గూండాలు రెచ్చిపోతున్నారు. విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలను కొడితే దిక్కెవడంటూ జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు.
సీఎం చంద్రబాబు 3 నెలలు మమ్మల్ని వదిలేయాలంటూ జేసీ వ్యాఖ్యానించారు. టీడీపీ విమర్శించేవారందరినీ ఉతికి ఆరేస్తామన్న జేసీ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ గూండాగిరి ప్రదర్శించారు.
