
సాక్షి,న్యూఢిల్లీ : ఇండియా కూటమిని చూసి బీజేపీ బయపడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై ఆయన మాట్లాడారు.
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని చూసి బీజేపీ బయపడుతుందోని చెప్పారు. కాబట్టే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇవి రివెంజ్ పాలిటిక్స్. బీజేపీ ఇండియా అలయన్స్కు బయపడుతుంది. వరుస అరెస్ట్లతో ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. మోదీ ఆలోచన వన్ నేషన్ .. నో ఎలక్షన్. దేశం మొత్తం ఓపీడీ... వన్ పర్సన్ డిక్టేటర్ షిప్ అంటూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ విమర్శలు చేశారు.