‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’ | Gudivada Amarnath Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’

Jun 26 2025 6:10 PM | Updated on Jun 26 2025 6:41 PM

Gudivada Amarnath Takes On Chandrababu Govt

విశాఖ: కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాత్‌ స్పష్టం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఆయన విమర్శించారు. ‘ బాబు మోసాలను 6 వారాలు పాటు ప్రజల్లోకి తీసుకువెళ్తాము.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు స్తాయి వరకు తెలియజేస్తాము.చంద్రబాబు హామీలను QR కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తాము. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు చంద్రబాబు ఇవ్వద్దంటున్నారు. టిడిపి వాళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలు అందించారు. గతంలో మేనిఫెస్టో ను వెబ్ సైట్ నుంచి తీసివేసిన ఘనత చంద్రబాబుది. 

చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజలన్న భయం లేదు. ప్రభుత్వ పథకాలు అందిస్తామని గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారు.  చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి గ్యారెంటీ, వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు మోసం చేస్తారని మొదటి నుంచి చెపుతున్నాము. నిరుద్యోగ భృతి అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నెలకు రూ. 1500, 20 లక్షల ఉద్యోగాలు ఏమి అమలు చేయలేదు. 

తల్లికి వందనంకు సవా లక్ష ఆంక్షలు పెట్టారు.. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుంధో ఎవరికి తెలియదు. ప్రజల్లోకి వెళ్లడానికి టీడీపీ నేతలు యపడుతున్నారు..టిడిపి నాయకులు మాస్కులు వేసుకొని ప్రజలు దగ్గరకు వెళ్ళాలని చూస్తున్నారు. టిడిపి నేతలను ప్రజలు నిలదీయాలి. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమీ కనిపించలేదు. చంద్రబాబు లోకేష్ పెత్తనం ప్రభుత్వంలో కనిపిస్తుంది..‘సన్‌’ స్ట్రోక్‌ వలన పవన్‌న చంద్రబాబు పక్కనపెడుతున్నారు’ అని గుడివాడ అమర్నాత్‌ విమర్శించారు. 

చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తాం: గుడివాడ అమర్నాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement