చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు | Deputy CM Narayana swamy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు

Jan 17 2022 4:13 AM | Updated on Jan 17 2022 4:13 AM

Deputy CM Narayana swamy fires on Chandrababu - Sakshi

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

కార్వేటినగరం: కుప్పం ఓటమితో మతి భ్రమించిన చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూ ప్రభుత్వంపై కక్షసాధింపునకు దిగుతున్నారని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా ఎల్‌ఆర్‌ పేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదల ఆసరా కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల కరపత్రాలను దగ్ధం చేసినంత మాత్రాన ప్రజలు బాబును నమ్ముతారని అనుకోవడం టీడీపీ నాయకుల మూర్ఖత్వం అన్నారు. ప్రజల ఓటు బ్యాంకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికేనని, టీడీపీ భూస్థాపితం ఖాయమన్నారు. శవరాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement