ఏం చేసినా హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే

BJP Will Be Win In Huzurabad Elections Says Etela Rajender - Sakshi

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా.. హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు నీచమైన, హేయమైన పద్ధతికి దిగారన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజురాబాద్‌ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. తరుణ్‌చుగ్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top