క్విడ్‌ప్రోకోతోనే ఖమ్మం సభ: రఘునందన్‌

BJP MLA Raghunandan Rao Comments On Khammam Public Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావసభ నిర్వహ­ణ వెనుక ‘క్విడ్‌ప్రోకో’­కోణం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. మియాపూర్‌ హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 78లో ఆదిత్య కంపెనీ పేరిట తోట చంద్రశేఖర్‌ కొన్న 40 ఎకరాల ప్రభుత్వ భూము­లను (సుమారు రూ.4వేల కోట్ల విలువ) ఆయనకు కట్టబెడుతు­న్నారని ఆరోపించారు.

ఇందుకు ప్రతిఫలంగా ‘క్విడ్‌ప్రోకో’కింద ఖమ్మం సభకు చంద్రశేఖర్‌తో ఖర్చు పెట్టి­స్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడి­యాతో మాట్లాడుతూ..ఈ భూములను బీఆర్‌­ఎస్‌ ఏపీ విభాగం అధ్యక్షుడికి ఎలా కట్టబె­డుతున్నారో ఖమ్మం సభలో చెప్పాలని డి­మాం­డ్‌ చేశారు.  నిజాం నవాబు వారసుడికి అధికారిక అంత్యక్రియలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా తెలంగాణ పోరాట అమరు లను అవమానించినట్ల అయ్యిందన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top