యూపీ అసెంబ్లీ ఎన్నికలు: ఆ పార్టీలతోనే బీజేపీ పొత్తు | BJP to fight UP polls with Apna Dal, Nishad Party: Nadda | Sakshi
Sakshi News home page

యూపీ అసెంబ్లీ ఎన్నికలు: ఆ పార్టీలతోనే బీజేపీ పొత్తు

Jan 20 2022 10:20 AM | Updated on Jan 20 2022 12:52 PM

BJP to fight UP polls with Apna Dal, Nishad Party: Nadda - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలతో పొత్తు ఖరారు చేసుకుంది. అప్నాదళ్, నిషాద్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు వెనుబడిన వర్గాల  నుంచి మద్దతు ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని నడ్డా విలేకరుల సమావేశంలో చెప్పారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం శాంతి భద్రతలు, పెట్టుబడులు, సామాజిక అభ్యున్నతిలో  మంచి పనితీరుని కనబరుస్తోందని చెప్పారు. త్వరలోనే సీట్లసర్దుబాటు పూర్తవుతుం దని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అప్నాదళ్‌ చీఫ్‌ అనుప్రియ పటేల్, నిషాద్‌ పార్టీ అధినేత సంజయ్‌ నిషాద్‌లు మోదీ ప్రభుత్వం ఒబిసిల ప్ర యోజనాల కోసం పని చేస్తుందని కొనియాడారు.  

చదవండి: (పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement