
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ప్రజా తీర్పుతో గెలిచిన కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఎవరూ ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు.
కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. రాహదారులపై ఈరోజు ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష చేస్తున్నాను. ప్రసాదం, రామాయణ్ సర్క్యూట్ స్కీమ్స్ ద్వారా వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కరీంనగర్- హసన్పర్తి రైల్వే లైన్ ప్రణాళికకు రూపొందిచబోతున్నాం. దాని వల్ల కరీంనగర్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కరీంనగర్కు త్రిబుల్ ఐటీ వంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తాను.
ఇక, తెలంగాణలో రాజకీయాలకు వస్తే రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. కానీ, వారంతా బీజేపీలోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే వాళ్లు మా పార్టీలోకి రావడానికి తర్జనభర్జన పడుతున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న వాళ్లను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏ తప్పు అయితే చేసిందో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.