
మళ్లీ విత్తుకోవాల్సిందే..
ముందస్తు వర్షాలతో దుక్కి దున్ని పత్తి విత్తనాలు వేశా. ఎకరాకు సరిపడా విత్తనాలకే రూ.3 వేలు ఖర్చు చేశా. 15రోజులు దాటినా ఒక్కటీ మొలవలేదు. గట్టివాన పడలేదు. ఎండలకు పంటపై ఆశలు వదులుకున్న. వానలు కొడితే మళ్లీ విత్తనాలు వేయాలి. ఇది అదనపు భారమే.
– గాజర్ల రవి, రైతు,
కాల్వశ్రీరాంపూర్
వాన పడకుంటే కష్టమే
నాకు ఉన్న రెండెకరాల్లో పత్తి వేశాను. నైరుతి రుతుపవనాలు తీరం దాటినయి.. ముందస్తు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలతో సాగు మొదలుపెట్టా. ఎకరాకు రూ. 10వేల చొప్పున మొత్తం రూ.20వేల వరకు ఖర్చయ్యింది. వారంలోగా వర్షాలు రాకపోతే పంట ఎండిపోయే ప్రమాదం ఉంది.
– నల్లెంగి సదయ్య, రైతు,
రేగడిమద్దికుంట

మళ్లీ విత్తుకోవాల్సిందే..