
మూడు జిల్లాలకు వారధిగా పేట వంతెన
● కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
ఓదెల(పెద్దపల్లి): రూపునారాయణపేట వద్ద మానేరుపై చేపట్టిన వంతెన నిర్మాణంతో మూడు జిల్లాల కు రవాణా మెరుగవుతుందని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రూ.80 కోట్ల వ్యంతో మానేరుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి బుధవారం వారు శంకుస్థాపన చేశారు. తొలుత ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచినా తను సంతోషపడలేదని, పనులు ప్రారంభం కావటంతో సంబుర పడుతున్నానన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, వంతెనకు ఇరువైపులా అప్రోచ్రోడ్ల నిర్మాణానికి అదనంగా రూ.7 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, పొత్కపల్లి సింగిల్విండో చైర్మన్ ఆళ్ల సుమన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు ఈర్ల స్వరూప, మినపాల ప్రకాశరావు, మాజీ జెడ్పీటీసీ సారయ్యగౌడ్ పాల్గొన్నారు.
సమర్థవంతంగా అంగన్వాడీ కేంద్రాలు..
పెద్దపల్లిరూరల్: అంగన్వాన్వాడీ కేంద్రాలను సమ ర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. సఖీ సెంటర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ నిర్మించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్ కాంట్రాక్ట్ను చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు కేటాయించామని తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రొటోకాల్ తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లా ఆ స్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్, డీఆర్డీవో కాళిందిని, వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాల్రావు ఉన్నారు.
20న అవగాహన సదస్సు
మంథనిరూరల్: బట్టుపల్లిలో ఈనెల 20న పీఎం దర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్పై సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.