
అభివృద్ధిలో అగ్రభాగాన రామగుండం
● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్
జ్యోతినగర్(రామగుండం): అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గం అగ్రభాగాన నిలుస్తోందని ఎ మ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డు, కృష్ణానగర్లో ఆయన పాదయాత్ర చేశారు. ప్రజల సమస్య లను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం క ళాశాల రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం డీసీసీ కార్యదర్శి ఎండీ రహీం ఎమ్మెల్యేకు శా లువా కప్పి సన్మానించారు. ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత, నాయకులు వెంగల బాపు, ఈ దునూరి రవి, అబ్దుల్లా, శంకర్ పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడితే జైలుకే..
పాలకుర్తి(రామగుండం): సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపిస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ హెచ్చరించారు. జీడీనగర్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన ప్రొసీడింగ్స్ అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం స్థానికంగా సోలార్ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఆయన ఇచ్చారు. తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రామ్మోహనాచారి, కన్నాల సింగిల్విండో చైర్మన్ బయ్యపు మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, పుట్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.