
‘మోడల్’ విద్యార్థుల ప్రతిభ
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబర్చారు. సైన్స్, సోషల్, గణితం, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ పోటీల్లో పలు పతకా లు సాధించారు. ఇందులో ఆర్.పరమేశ్ గోల్డ్ మెడల్తోపాటు రూ.వెయ్యి నగదు బహుమతి అందుకున్నారు. సింధూ, అక్షిత, లాస్య, సిరివల్లి, మన్విత, కార్తిక, ధృవనాథ్, తిరుమలేశ్ తదితరులు ప్రతిభ కనబర్చారు. వీరిని ఉపాధ్యాయులు, అధ్యాపకులు సన్మానించారు. ప్రిన్సిపాల్ షాదూల్ తదితరులు అభినందించారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
జ్యోతినగర్(రామగుండం): వైద్య, ఆరోగ్య చేపట్టే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆవరణలో బుధవారం సమగ్ర ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు. డయాబెటిస్, బీపీ, హిమోగ్లోబిన్, ర్యాండమ్ బ్లడ్ శాంపిల్, క్షయ నిర్ధారణకు తెమడ, ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు. జననేంద్రియాల అంటువ్యాధులకూ పరీక్షలు చేశారు. డాక్టర్లు రాజమౌళి, సాధిక్ పాషా, నాగ భూషణం, సిబ్బంది పాల్గొన్నారు.
నియామకం
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ నినాదంతో ప్రధాని మోదీ ప్రారంభించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమం జిల్లా ఇన్చార్జిగా సోమారపు లావణ్యను నియమించారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
రోడ్డుపై చెత్త.. రూ.2వేల జరిమానా
సుల్తానాబాద్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ రో డ్డు ఏరియాలో రహదారిపై చెత్త వేసిన చింతల శ్రీనివాస్కు రూ.2,000 జరిమానా విధించిన ట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్ బుధవారం తెలిపారు. రోడ్డుపై, ఖాళీ స్థలాల్లో చెత్తవేసిన వారికి జరిమానా విధిస్తామని ఆయ న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతుభరోసా’ జమ
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని పలువురు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా సాయం జమచేసినట్లు జిల్లా వ్యవసాయ అధి కారి ఆదిరెడ్డి తెలిపారు. మంగళవారం వరకు జిల్లాలోని 1,01,397 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.54,70,63,881 జమచేశామని, బుధవారం మరో 21,119 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.31,23,37,920 జమచేశామని ఆయన వివరించారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
పెద్దపల్లిరూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీ ఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరా వు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధ వారం జరిగిన తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ స మావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం పె ట్టుబడిదారుల కోసం కార్మికులను బానిసలు గా మార్చుతోందని, ఇందుకోసం నాలుగు లే బర్ కోడ్లను అమలులోకి తెచ్చిందన్నారు. వా టిని రద్దు చేయాలనే డిమాండ్తో జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనాలని ఆయన కోరారు. పంచా యతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలనే డిమాండ్తో ఈనెల 27న చలో హైదరాబాద్ చేపట్టామని తెలిపారు. సీపెల్లి రవీందర్, ఖాజా, శ్రీనివాస్, రాజయ్య, ముస్తఫా, నాగేశ్వర్, నాగరాజు, మల్లయ్య, నారాయణ, భాస్కర్ పాల్గొన్నారు.

‘మోడల్’ విద్యార్థుల ప్రతిభ

‘మోడల్’ విద్యార్థుల ప్రతిభ

‘మోడల్’ విద్యార్థుల ప్రతిభ