సింగరేణి బొగ్గు | - | Sakshi
Sakshi News home page

సింగరేణి బొగ్గు

Jun 16 2025 5:08 AM | Updated on Jun 16 2025 5:08 AM

సింగరేణి బొగ్గు

సింగరేణి బొగ్గు

అధిక ఆదాయమే లక్ష్యం
● సింగరేణి యాజమాన్యం వినూత్న ప్రయోగం ● రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బొగ్గు విక్రయ కేంద్రం ● చిన్న పరిశ్రమలకు సరఫరా లక్ష్యం ● వినియోగదారుల సేవలపై ప్రత్యేక దృష్టి
రైల్వే ద్వారా రవాణా

చిన్న

పరిశ్రమలకు

గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్‌, సోలార్‌, హైడల్‌ విద్యుత్‌ తయారీలో దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ.. తాజాగా తన వ్యాపారాన్ని వినూత్నరీతిలో విస్తరించేందుకు శ్రీకారం చుడుతోంది. తక్కువ ఖర్చుతో చిన్నపరిశ్రమల చెంతనే విక్రయించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీనిద్వారా సంస్థకు నేరుగా నగదు లభించడంతోపాటు రవాణా ఖర్చు తగ్గుతుందని, బొగ్గు విక్రయాలు జోరందుకుంటాయని యాజమాన్యం భావిస్తోంది.

రాష్ట్ర రాజధానిలో విక్రయ కేంద్రం..

రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో బొగ్గు విక్రయకేంద్రం ఏర్పాటు చేస్తే పెద్ద, మధ్య తరహాతోపాటు చిన్న పరిశ్రమలకూ త్వరితగతిన బొగ్గు అందించా లని చూస్తోంది. దీనిద్వారా కొనుగోలుదారులు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తోంది. సింగరేణి బొగ్గు వినియోగం హైదరాబాద్‌లోనే అధికంగా ఉంది. అక్కడి వినియోగదారులు రామగుండం లేదా కొత్తగూడెం వచ్చి బొగ్గు కొనుగోలు చేసి తీసుకెళ్లడం భారంగా మారుతోంది. తక్కువ బొగ్గు అవసరమయ్యే వారికి అధిక వ్యయం అవుతోంది. ఈ క్రమంలో సింగరేణి అడుగుముందుకేసి బహిరంగ మార్కెట్‌లో బొగ్గు విక్రయించాలని యోచిస్తోంది.

అనేక రాష్ట్రాలోనూ విక్రయాలు..

సింగరేణి ఏటా 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉ త్ప త్తి చేస్తోంది. ఈ బొగ్గును పలు రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకూ విక్రయిస్తోంది. బొగ్గును కొనుగోలు చేసిన వినియోగ దారులు ప్రధానంగా రైల్వేద్వారా తరలించుకుపోతున్నారు. ఈక్రమంలో అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. సింగరేణి బొగ్గు నాణ్యంగా ఉండడంతో కస్టమర్లు ఇష్టపడుతున్నారు. అలాగే కొందరు రోడ్డుమార్గంలోనూ రవాణా చేసుకుంటున్నారు. ఎటొచ్చీ తక్కువ బొగ్గు అవసరమైనవారికి తీసుకెళ్లడం ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి వారికోసమే హైదరాబాద్‌లో బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ బలరాం యోచిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

చిన్నతరహా పరిశ్రమలకు అందుబాటులో..

చిన్నతరహా పరిశ్రమలకు తక్కువ బొగ్గును సింగరే ణి ఏరియాలకు వచ్చి తీసుకువెళ్లడం గిట్టుబాటు కావడం లేదని సీఎండీ గుర్తించారు. వీరికోసం హై దరాబాదుకు సమీపంలో బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయ డానికి గల అవకాశాలను పరిశీలించాలని ఆ యన ఆదేశాలు జారీ చేశారు.

వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు

సింగరేణిలో నాణ్యమైన బొగ్గును వినియోదారులకు అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈమేరకు జీ–14, 15 గ్రేడ్‌ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఈరెండు గ్రేడ్‌లకు బదులుగా జీ–13 గ్రేడ్‌ బొగ్గును సరఫరా చేయాలని నిర్ణయిచింది. భూపాలపల్లి ఏరియాలోని భూగర్భ గనుల్లో సాండ్‌ స్టోయింగ్‌ కోసం గోదావరి నది నుంచి ఇసుక సేకరణకు వెంటనే క్వారీ ఏర్పాటుకు అనుమతులు సాధించాలని సూచించింది.

సింగరేణి గనుల్లో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును వినియోగదారులకు అందించాలనే ఆలోచనతో యాజమాన్యం ఉంది. రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా చేస్తే టన్నుకు రూ.1,600 వరకు ఖర్చు అవుతోంది. అదే రైల్వే ద్వారా హైదరాబాద్‌ కోల్‌డంప్‌యార్డుకు తరలిస్తే టన్నుకు కేవలం రూ.500 వరకే ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో కస్టమర్లకు బొగ్గు తక్కువ ధరకే విక్రయించవచ్చని సింగరేణి ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement