ప్రాణాలు పోయేలా ఉంది | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోయేలా ఉంది

Jun 16 2025 5:08 AM | Updated on Jun 16 2025 5:08 AM

ప్రాణ

ప్రాణాలు పోయేలా ఉంది

అనారోగ్యంతో బాధపడే వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యం లేదు. మా ఊరు నుంచి బయటకు వెళ్లేందుకు రైల్వేట్రాక్‌ అడ్డుగా ఉంది. కనీసం అంబులెన్స్‌ కూడా రాని పరిస్థితి. రాత్రివేళ గూడ్స్‌ రైళ్ల రాకపోకలు ప్రమాదకరంగా ఉన్నాయి. గంట ల తరబడి ట్రాక్‌పైనే నిలిపి ఉంటున్నాయి. అవి ఎప్పుడు కదులుతాయో తెలియని పరిస్థితి. ప్రత్యామ్నాయంగా ఇక్కడ భూగర్భ వంతెన నిర్మించాలి.

– ఇత్తినేని కిషన్‌, గ్రామస్తుడు, మల్యాలపల్లి

మా ఊళ్లపై రైల్వేశాఖ నిర్లక్ష్యం

బద్రిపల్లి, మల్యాలపల్లి గ్రామాలకు కనీసం రైల్వే భూగర్భ వంతెనలు లేవు. మా ఊళ్లపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతీబడ్జెట్‌లో రైల్వే గేట్లను ఎత్తివేస్తామని ఇచ్చే హామీలు ఉత్తివే అవుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ స్పందించి రైల్వేశాఖపై ఒత్తిడి తేవాలి. మాకు రవాణా మార్గం కల్పించాలి. తక్కువ ఖర్చుతో భూగర్భ వంతెన నిర్మించే అవకాశం ఉంది. రైల్వేకు ఆదాయం, మాకు రాకపోకల సౌకర్యం ఉంటాయి.

– మహేశ్‌, గ్రామస్తుడు, బద్రిపల్లి

అన్నింటికీ ఇబ్బందులే

ట్రాక్‌పై గంటల తరబడి గూడ్స్‌ నిలిపి ఉంచ డంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయనే విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విచారణ జరుపుతామని సమాధా నం ఇవ్వ డం తప్ప ఇటువైపు ఎవరూ రావడంలేదు. టెంట్‌హౌస్‌ సామాగ్రి తరలించడంతో గంటల తరబడి ఆలస్యమవుతున్నది. పనులు సకాలంలో పూర్తి చేయడంలేదు. కస్టమర్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైల్వేశాఖ వెంటనే స్పందించి మాకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. – సురేశ్‌, టెంట్‌హౌస్‌ నిర్వాహకుడు, మల్యాలపల్లి

ప్రాణాలు పోయేలా ఉంది 
1
1/2

ప్రాణాలు పోయేలా ఉంది

ప్రాణాలు పోయేలా ఉంది 
2
2/2

ప్రాణాలు పోయేలా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement