
9న సార్వత్రిక సమ్మె
సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్రప్రభుత్వం అ నుసరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసగా జూలై 9న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక స మ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కా ర్యాలయంలో ఆదివారం సమ్మె ప్రచార పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న చ ట్టాలను రద్దుచేసి, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఇవి అమలులోకి వస్తే 8 గంటలకు బ దులు 12 గంటలపాటు పనిచేయాల్సి వస్తుంద ని ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికు లు, ఉద్యోగులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చే శారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి, నాయకులు ఎండీ ఖాజా, జంగపల్లి నరేశ్, ఎండీ ముస్తఫా, రాజు పాల్గొన్నారు
18న ‘చలో హైదరాబాద్
సుల్తానాబాద్(పెద్దపల్లి): విద్యార్హతల ఆధారంగా విద్యత్ సంస్థలో పనిచేసే ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలనే డిమాండ్తో ఈనెల 18న చేపట్టి న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యుత్ సంఘాల జేఏసీ కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ కోరారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాన్స్కో, జెన్కో తదితర విభాగాల్లో పనిచేసే ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో బహిరంగసభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
భవన నిర్మాణానికి భూమిపూజ
పాలకుర్తి(రామగుండం): మండల కేంద్రంలో చేపట్టిన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దంపతులు ఆదివారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆధునిక వసతులతో భవనం నిర్మిస్తారన్నారు. ఏడు విభాగాలకు ప్రత్యేక కార్యాలయాలు, సదుపాయాలు, విలాసవంతమైన భవనం నిర్మిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం రవీందర్, కాంగ్రెస్ ప్రతినిధులు ముక్కెర శ్రీనివాస్, పాత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్లకు రివార్డులు
గోదావరిఖని: లోక్ అదా లత్ విజయవంతానికి కృషిచేసిన పోలీసుఅధికారులు, ఉద్యోగులకు రివార్డులు అందజేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో చే పట్టిన మెగా లోక్ అదాలత్లో 13,048 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 80 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ17,66,294 తిరిగి అందజేశామన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించి 1,432, పెటీ 56, ఈ– పెటీ 8,568, డ్రంక్ అండ్ డ్రైవ్ 2,456 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. పోలీస్ అధికారులు, కోర్టు సి బ్బంది శ్రమించి కేసుల రాజీలో కీలకంగా వ్యవహరించారని ఆయన ప్రశంసించారు.

9న సార్వత్రిక సమ్మె