తాగునీటి సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సరఫరాకు చర్యలు

Apr 18 2025 1:48 AM | Updated on Apr 18 2025 1:48 AM

తాగున

తాగునీటి సరఫరాకు చర్యలు

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ 23వ డివిజన్‌లో గురువారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఏజీఎం(హెచ్‌ఆర్‌) బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌, ఎస్బీసీ సభ్యుడు బాబర్‌ సలీంపాషా పర్యటించారు. ఎన్టీపీసీ పైప్‌లైన్‌ ద్వారా ఐదురోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత దృష్టికి బాబర్‌ తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో పైప్‌లైన్‌ వేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఏజీఎం స్పష్టం చేశారు. కాకతీయనగర్‌, ఆటోనగర్‌ ప్రాంతాల్లో సైతం పర్యటించి ప్రజల సమస్యలు తెలసుకున్నారు. ఎన్టీపీసీ సీఎస్సార్‌ ద్వారా నిధులు కేటాయించి వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీపీసీ సివిల్‌ విభాగం అధికారి ఎల్‌ఆర్‌ఎస్‌ రెడ్డి, దాసరి ఆనంద్‌, జహీరొద్దీన్‌, గౌస్‌పాషా, శేఖర్‌ పాల్గొన్నారు.

బ్రిడ్జి పరిశీలన

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌ ఐదో డివిజన్‌ మల్కాపూర్‌ రోడ్‌లో ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిని గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ పరిశీలించారు. మల్కాపూర్‌ నుంచి గోదావరినది వైపు వెళ్లే రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించామని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే ప్రజలకు ఉపయోగకరంగా బ్రిడ్జితో పాటు రోడ్‌ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్‌ అధికారులు రామన్‌, హనుమనాయక్‌, డీసీసీ సెక్రటరీ ఎండీ.రహీం తదితరులు పాల్గొన్నారు.

డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులివ్వాలి

పెద్దపల్లిరూరల్‌/రామగుండం: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద గల డాక్యుమెంట్‌ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్స్‌లు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని రైటర్లు ఇఫ్తెకార్‌, తిరుమల్‌ తదితరులు కోరారు. అలాగే రామగుండంలో డాక్యుమెంట్‌ రైటర్లు గురువారం కార్యాలయాలను మూసివేసి నిరసన తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ బాలకిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రైటర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమకు లైసెన్సులు మంజూరు చేసి శాశ్వత ఉపాధి భద్రత కల్పించాలని కోరారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,415

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మార్కెట్‌లో గురువారం పత్తి క్వింటాల్‌ గరిష్ట ధర రూ.7,415, కనిష్టం రూ.6,308, సగటు ధర రూ.7,144 పలికినట్లు ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్‌ తెలిపారు.

తాగునీటి సరఫరాకు చర్యలు1
1/2

తాగునీటి సరఫరాకు చర్యలు

తాగునీటి సరఫరాకు చర్యలు2
2/2

తాగునీటి సరఫరాకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement