
‘భట్టి’ని కలిసిన కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు
గోదావరిఖని: డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ) నిధులు విడుదల చేయాలని కోరుతూ కోల్బె ల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయనను కలిసి లేఖ అందజేశారు. కోల్బెల్ట్ ప్రాంత అభివృద్ధి కి నిధులు త్వరగా విడుదల చేయాలన్నారు. కో ల్బెల్ట్ ప్రాంతాల్లో మైనింగ్తో ప్రజల ఆరోగ్యం, జీ వన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంద న్నారు. స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా, రహదారి, ఆరోగ్య శిబిరాలు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఈనిధులు ఎంత గానో తోడ్పతాయని అన్నారు. ఇప్పటికే నిధులు మంజూరైనా విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోందన్నారు. డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. ప్రత్యే కంగా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, ప్ర భుత్వ ప్రాధాన్యత, సంబంధిత శాఖలతో చర్చించి, త్వరితగతిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజ్ఠాకూర్, గంట సత్యనారాయణ, బీర్ల ఆయిలయ్య తదితరులు ఉన్నారు.