భరోసా ఏది? | - | Sakshi
Sakshi News home page

భరోసా ఏది?

Apr 3 2025 1:01 AM | Updated on Apr 3 2025 1:01 AM

భరోసా

భరోసా ఏది?

జిల్లా సమాచారం

సాక్షి, పెద్దపల్లి: సాగు పెట్టుబడి కోసం ప్రవేశపెట్టిన రైతుభరోసా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు, నాట్లువేసే సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసాను పంటలు కోతకు వచ్చినా విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు మొదట్లోనే బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే ఎరువులు, కూలీలు తదితర ఖర్చులకు ప్రభు త్వం ఇచ్చే పైసలు ఉపయోగపడేవి. విడుదలతో ఆలస్యంతో రైతులపై అప్పులు, వడ్డీభారం పడుతోంది. సాగుకు యోగ్యమైన భూములకే రైతుభరోసా ఇస్తామని జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. విడతల వారీగా మార్చి 31వ తేదీ వరకు పలువురు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది. అయినా, ఇప్పటివరకు వారి ఖాతాల్లో డబ్బులు పడలేదని, పడుతాయో లేదోనని రైతులు వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

2,665 ఎకరాలకు రైతుభరోసా కట్‌

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇటుకబట్టీలు తదితర సా గులో లేనిభూములకు గత ప్రభుత్వం పెట్టుబడి సా యం అందించింది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ధర ణి పోర్టల్‌ ద్వారా అనుసంధానించిన పట్టా కలిగిన భూములను వ్యవసాయశాఖ అధికారులతో సర్వే చేయించింది. ఇందులో జిల్లాలో 2,78,555 ఎకరాలకు పట్టా ఉండగా, అందులో 2,655.32 ఎకరాలు సాగులో లేవని గుర్తించారు. కేవలం 2,75,899 ఎకరాలు సాగులో ఉన్నాయని, వాటికి 1,61,032 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.165.53కోట్లు జమచేయాల్సి ఉందని తేల్చారు.

మూడెకరాలు.. ఐదు విడతలు

గత యాసంగి నుంచి ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఇందులో భాగంగా తొలుత జనవరి 27న పైలెట్‌ గ్రామాల్లోని రైతు ల ఖాతాల్లో నిధులు జమచేశారు. ఫిబ్రవరి 5న ఎక రం ఉన్న రైతులకు, 10న రెండెకరాలు, 12న మూడెకరాల్లోపు భూములు ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ఆపై భూమి కలిగిన వారి ఖాతాల్లో ఇప్పటివరకు పైసలు పడేలేదు. ఇప్పటివరకు 1,14,313 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.82.57కోట్లు జమచేశారు. ఇంకా సుమారు 45వేల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.51కోట్ల వరకు జమచేయాల్సి ఉంది. ఇదే విషయమై డీఏవో ఆదిరెడ్డిని సంప్రదించగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ అవుతాయన్నారు.

పంటలు కోతకు వచ్చినా స్పష్టత కరువు

పెట్టుబడి కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు

పట్టా భూమి(ఎకరాల్లో): 2,78,555

సాగుయోగ్యమైనది(ఎకరాలో్ల) 2,75,899

రైతుల సంఖ్య: 1,61,032

మొత్తం పెట్టుబడి సాయం 165.53 (రూ.కోట్లలో)

ఇప్పటివరకు ఖాతాల్లో జమైంది 82.57 (రూ.కోట్లలో)

సాయం పొందిన రైతుల సంఖ్య 1,14,313

భరోసా ఏది?1
1/1

భరోసా ఏది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement