చైనాలో డ్రాగన్‌ బోట్‌ పోటీలకు శివాంజనేయ | - | Sakshi
Sakshi News home page

చైనాలో డ్రాగన్‌ బోట్‌ పోటీలకు శివాంజనేయ

Sep 9 2026 12:47 AM | Updated on Sep 9 2026 12:47 AM

గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ గేదెల శివాంజనేయ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డ్రాగన్‌ బోట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. చైనాలోని హాంగ్‌జౌలో ఈ నెల 30 నుంచి అక్టోబర్‌ 3 వరకు జరిగే ఐసీఎఫ్‌ డ్రాగన్‌ బోట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు భారతీయ కయాకింగ్‌ అండ్‌ కెనోయింగ్‌ అసోసియేషన్‌ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 28న భారత బృందం చైనాకు బయలుదేరి అక్టోబర్‌ 4న తిరిగి రానుంది. ప్రస్తుతం శివాంజనేయ ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement