
యోగాంధ్ర విజేతలకు అభినందన
పార్వతీపురం టౌన్: యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా వాసులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ బుధవారం అభినందించారు. 13 కేటగిరీలకు 8 కేటగిరీల్లో 10 స్థానాల్లో బహుమతులను గెలుచుకోవడం హర్షణీయమన్నారు. 10 బహుమతుల్లో మూ డు ప్రథమ, రెండు ద్వితీయ, ఐదు తృతీయ బహుమతులు ఉన్నాయి. కార్యక్రమంలో డీఆర్వో హేమలత, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాంఅధికారి డాక్టర్ వినోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పైడితల్లి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తా
● బాధ్యతలు
స్వీకరించిన ఇన్చార్జి
ఈఓ కె.శిరీష
విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో కృషిచేస్తానని ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. ఇన్చార్జి ఈఓగా ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
చంద్రబాబు అంటేనే మోసం..
రేగిడి: జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు అంటేనే మోసం అనే పుస్తకాన్ని రేగిడి మండలం చిన్నశిర్లాం గ్రామంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో అంతా మోసమే జరిగిందని, ఈ మోసాన్ని వివరిస్తూ పార్టీ అధిష్టానం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ప్రచురించిందని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మండలాలు వారీగా ఆవిష్కరణలు జరుగుతున్నా యని వివరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఏడాది కాలంలోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందించా రని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎన్నికలు ముందు ప్రజలకు సూపర్సిక్స్ హామీలిచ్చి మోసం ఫిక్స్ చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, నాయకులు పాల్గొన్నారు.

యోగాంధ్ర విజేతలకు అభినందన