గిన్నిస్‌ బుక్‌లో చోటు | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ బుక్‌లో చోటు

Apr 27 2025 1:26 AM | Updated on Apr 27 2025 1:26 AM

గిన్నిస్‌ బుక్‌లో చోటు

గిన్నిస్‌ బుక్‌లో చోటు

డెంకాడ: మండలంలోని పెదతాడివాడ వద్ద ఉన్న మెర్సీమిషన్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.కిరణ్‌బాబు, విద్యార్థిని కె.కెరెన్‌ జాస్పర్‌కు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కింది. కీబోర్డు వాయిద్యంలో 45 నిమిషాల నిడివి గల వీడియో చేసి చోటు దక్కించుకున్నట్టు ప్రిన్సిపాల్‌ శనివారం తెలిపారు. విజయవాడకు చెందిన హల్లెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు పాస్టర్‌ అగస్టీన్‌ దండంగి ఇన్‌స్ట్రాగామ్‌ సోషల్‌ మీడియాలో 18 దేశాలకు చెందిన 1090 మంది కీ బోర్డు వాయిద్యంలో 45 నిమిషాల విడివి ఉన్న సరళీ స్వరాల వీడియోను అప్‌ లోడ్‌ చేశారు. గత ఏడాది డిసెంబర్‌ 1న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు కోసం వీటిని అప్‌లోడ్‌ చేశారు. వీటిలో 1046 చోటు సంపాదించుకున్నాయి. వీరిలో మెర్సీమిషన్‌ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ కె.కిరణ్‌బాబు, 4వ తరగతి విద్యార్థిని కె.కెరెన్‌ జాస్పర్‌ చోటు సంపాదించుకోవడంతో విజయవాడలో ఈ నెల 25వ తేదీన జరిగిన కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement