తరగతి గదిలో స్పృహ కోల్పోయిన ఇంటర్‌ విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో స్పృహ కోల్పోయిన ఇంటర్‌ విద్యార్థిని

Jan 7 2026 7:49 AM | Updated on Jan 7 2026 7:49 AM

తరగతి గదిలో స్పృహ కోల్పోయిన ఇంటర్‌ విద్యార్థిని

తరగతి గదిలో స్పృహ కోల్పోయిన ఇంటర్‌ విద్యార్థిని

సత్తెనపల్లి: తరగతి గదిలో ఇంటర్‌ విద్యార్థిని స్పృహ కోల్పోయిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్ల మండలం అనుపు గ్రామానికి చెందిన నూన్సావత్‌ లలితా భాయ్‌, నానునాయక్‌ దంపతుల కుమార్తె పట్టణంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తూ పట్టణంలోని వెంకటపతి కాలనీలో గల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం కళాశాలలో సాయంత్రం 4:00 గంటల సమయంలో స్పృహ కోల్పోగా కళాశాల సిబ్బంది సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోబీపీ, ఎనీమియా కారణంగా ఆమె స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిసేపటికి ఆమె కోలుకోవటంతో అటు కళాశాల, ఇటు హాస్టల్‌ సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement