పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించండి | - | Sakshi
Sakshi News home page

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించండి

Apr 25 2025 8:14 AM | Updated on Apr 25 2025 8:14 AM

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించండి

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించండి

నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏడు సెంటర్లలో శుక్రవారం నిర్వహించనున్న ఏపీఆర్‌ఎస్‌ కాట్‌, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌ పరీక్షలకు 2,650మంది విద్యార్థులు హాజరవుతున్నందున పరీక్షా కేంద్రాల్లో కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని డీఆర్‌ఓ ఏకా మురళి పేర్కొన్నారు. గురువారం జరగబోయే పరీక్షలపై కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కో–ఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ 5,6,7,8 తరగతుల్లో ప్రవేశానికి ఏపీఆర్‌ఎస్‌ కాట్‌, ఇంటర్‌, డిగ్రీలలో ప్రవేశానికి ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌ను ఉదయం 10 గంటల నుంచి 12గంటలు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. తాగునీరు, విద్యుత్‌, వైద్యసౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ ఎల్‌.చంద్రకళ, డీసీఓ ఎన్‌.సరోజని, ఆర్డీఓ కె.మధులత, ఆర్టీసీ, పోలీసు, హెల్త్‌ డిపార్టుమెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

అధికారులను ఆదేశించిన డీఆర్‌ఓ మురళి నేడు ఏడు కేంద్రాల్లో జరగనున్న ఏపీఆర్‌ఎస్‌ కాట్‌, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement