రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు

Apr 21 2025 7:59 AM | Updated on Apr 21 2025 7:59 AM

రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు

రసవత్తరంగా ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు

వినుకొండ: జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మండలంలోని మదమంచిపాడులోని మక్కెన చినరామయ్య ఆడిటోరియంలో రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగు పళ్ల సైజు విభాగంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎద్దులు 5160.2 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించాయి. నూజెండ్ల మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన జక్కిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి ఎడ్లు 5061.7 అడుగులు లాగి 2వ బహుమతి, పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందిన మోపర్తి నవీన్‌కుమార్‌చౌదరి ఎడ్లు 4809.2 అడుగులు లాగి 3వ స్థానంలో నిలిచాయి. 4వ బహుమతి మందలపు భాష్విక్‌ రెడ్డి, జ్ఞానత్‌ రెడ్డి (ఇస్సాపాలెం) ఎడ్లు, 5వ బహుమతి చిలుకూరి నాగేశ్వరరావు (బాపట్ల మండలం జె.పంగులూరు ), 6వ బహుమతి మేస్త్రి ఖాదర్‌మస్తాన్‌ ఎడ్లు ( యద్దనపూడి, బాపట్ల), 7వ బహుమతి యద్దనపల్లి మనోజ్‌కుమార్‌చౌదరి ఎడ్లు (రావిపాడు, నరసరావుపేట), 8వ బహుమతి బత్తుల శ్రీనివాసరావు ఎడ్లు (నవలూరు, మంగళగిరి), 9వ బహుమతి పసుమర్తి దివ్య శ్రీ ఎడ్లు ( భీమవరం, సత్తెనపల్లి) సాధించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు మక్కెన వెంకట్రావు, సుబ్బారెడ్డి, చిరంజీవి, కోటిరెడ్డి, అబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement