మోదీ డౌన్‌ డౌన్‌.. బీజేపీ డౌన్‌ డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

మోదీ డౌన్‌ డౌన్‌.. బీజేపీ డౌన్‌ డౌన్‌

Apr 19 2025 9:24 AM | Updated on Apr 19 2025 9:24 AM

మోదీ డౌన్‌ డౌన్‌.. బీజేపీ డౌన్‌ డౌన్‌

మోదీ డౌన్‌ డౌన్‌.. బీజేపీ డౌన్‌ డౌన్‌

అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు అమరావతి మెయిన్‌ రోడ్డులో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మోదీ డౌన్‌ డౌన్‌.. బీజేపీ డౌన్‌డౌన్‌ నినాదాలు చేశారు. మెయిన్‌ రోడ్డులోని మసీదు నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్‌, మద్దూరు డౌన్‌ సెంటర్‌ మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌కు చేరుకుంది. అక్కడ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిరసనకారులు తిరిగి మసీదుకు చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా పరిషత్‌ కో–ఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ హష్మీ మాట్లాడుతూ ముస్లింల హక్కులను కాలరాసే వక్ఫ్‌ చట్టాన్ని కూటమి పార్టీలు తప్పా మిగతావన్నీ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ముస్లింలంతా ఈ చట్టాన్ని ఐకమత్యంగా వ్యతిరేకించి విజయం సాధించాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు జాని, సీపీఎం నాయకులు రవిబాబు, సూరిబాబు, కాంగ్రెస్‌ పార్టీ నేత గోపి, ముస్లిం మత పెద్దలు ముఫ్తి మెజహిదుల్‌ ఇస్లాం, ముఫ్తి రహమతుల్లా, అబ్దుల్‌ ఖాదిర సాహెబ్‌, అబ్దుల గఫార్‌ సాహెబ్‌, మౌలానా అబ్దుల్‌ మస్తాన్‌, ఫారూక్‌, జిల్లా అవాజ్‌ కమిటీ కార్యదర్శి భాషా, స్టూడెంట్‌ ఇస్లామిక్‌ అర్గనైజేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కరీం మొహీద్దీన్‌ అదాం ప్రసంగించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున ముస్లింలతో పాటు మహిళలు పాల్గొన్నారు.

పెదకూరపాడులో..

వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెదకూరపాడులో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్‌ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసనలు సంఘీభావం తెలిపిన సీపీఎం,ప్రజాసంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement