మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మల్లావారం పంచాయతీలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్క్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 వినతులను అధికారులు స్వీకరించి కొన్నింటి అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని పరిశీలించి పరిష్కరిచాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజనుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి అధికారి దశరాఽథి సరబు, కలిమెల సమితి ఉద్యోగులు పాల్గొన్నారు.


