భువనేశ్వర్: స్థానిక ప్రదర్శన మైదానం నుంచి రామ మందిరం కూడలి గుండా దిగువ పీఎంజీ వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ‘జన్ ఆక్రోష్ మహిళా పాదయాత్ర‘ బుధవా రం నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న మహిళలు నల్లని వస్త్రధారణతో ప్రతిపక్షాల వ్యతిరేక నినాదాలతో పరిసరాల్ని హోరెత్తించారు. దిగువ పీఎంజీ ప్రాంతంలో మహిళా బిల్లు ఆమోదం వ్యతిరేకించిన నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, మంత్రులు పృథ్వీరాజ్ హరిచందన్, రవి నాయక్, నిత్యానంద్ గోండ్, గోకులానంద్ మల్లిక్, లోక్సభ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి తదితరులు పాల్గొన్నారు.


