రథాలపై నీలచక్రాల అమరిక | - | Sakshi
Sakshi News home page

రథాలపై నీలచక్రాల అమరిక

Jun 26 2025 6:15 AM | Updated on Jun 26 2025 6:15 AM

రథాలప

రథాలపై నీలచక్రాల అమరిక

పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని శ్రీమందిరంలో నీలచక్రాలకు పండాలు శాస్త్రోత్తంగా బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం వాయిద్యాలతో వీటిని శ్రీజగన్నాథ రథం నందిఘోష, బలభద్రస్వామి రథం తాలధ్వజ, సుభద్ర రథం దర్పదళన రథాలపై అమర్చారు. దీంతో నేటి నుంచి జగన్నాథ రథంపై హనుమాన్‌ జెండాను ఎగురవేస్తారు. అనేక దేవతామూర్తులు రథాయాత్రకు ఆటంకం కలుగకుండా ఈ పది రోజులు కాపాడతారనేది భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో రథాయాత్ర కమిటీ చైర్మన్‌, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, తహసీల్దార్‌ బెహారా, రథాయాత్ర కమిటీ సభ్యులు కుమార్‌, బసంత పండా, భరత్‌ భూషన్‌ మహంతి, రాజేంద్ర కుమార్‌ బెహరా, అశోక్‌ మహారాణా పాల్గొన్నారు.

రథాలపై నీలచక్రాల అమరిక 1
1/2

రథాలపై నీలచక్రాల అమరిక

రథాలపై నీలచక్రాల అమరిక 2
2/2

రథాలపై నీలచక్రాల అమరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement