
కాంగ్రెస్ విఫలయత్నం
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
సీఎం నివాసం ముట్టడికి..
వంశీకృష్ణ హోటల్ యజమానికి జరిమానా
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలపై సామూహిక అత్యాచారం, హత్య సంఘటనలు పెచ్చు మీరుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా పరిణమిస్తోంది. రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా రక్షణ కొరవడింది. డబుల్ ఇంజిన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి వార్షికోత్సవంలో తలమునకలై ఉంది. రాష్ట్రంలో ప్రతి రోజూ 15 మందికి పైగా మహిళలు, మైనరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారు. రాష్ట్రంలో 64,000 మందికి పైగా మహిళలు మరియు పిల్లలు తప్పిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన మంత్రి విచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కెంజొహర్ ప్రాంతం హరిచందన్పూర్లో మహిళపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీశారు. మరెన్నో ఇలాంటి సిగ్గు చేటు అకృత్యాలు నిత్య కృత్యాలుగా పరిణమిస్తున్నా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనల పట్ల చీమ కుట్టినట్లు అయిన స్పందించక పోవడం విచారకరమని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జి అజయ్ కుమార్ లల్లూ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు అన్ని జాతీయ రికార్డులను బద్దలు కొట్టిన ఏకై క రాష్ట్రం ఒడిశా అని ఆయన వ్యాఖ్యానించారు. గంజాం జిల్లా గోపాల్పూర్, కెంజొహర్ జిల్లా హరిచందన్పూర్, కటక్ జిల్లా బరాంగ్ మరియు అంగుల్ జిల్లా కనిహా మండలంలో జరిగిన భయంకరమైన మూక హత్యలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం భారీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు నిరసనకారులు విఫలయత్నం చేశారు.
రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరుగుతున్నందున ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా సంబరాలు చేసుకోవడం విచారకరమని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జి విమర్శించారు. మహిళలపై దారుణాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరవధికంగా పోరాడుతుందని ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినీపతి అన్నారు. భారతీయ జనతా పార్టీ మహిళలను ఆట బొమ్మలుగా భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతుందని అన్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ భవన్ నుంచి బయల్దేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి నివాసం ముట్టడించేందుకు బారికేడ్లను బద్దలు కొట్టి ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు సారథ్యం వహించిన ముందంజ నాయకుల్ని పోలీసులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు రామచంద్ర కదమ్, ఎమ్మెల్యేలు అశోక్ దాస్, సోఫియా ఫిరదౌసి, మహిళా కాంగ్రెసు నాయకురాలు మీనాక్షి బాహినీపతి, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘెరావ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూస్రీల్

కాంగ్రెస్ విఫలయత్నం

కాంగ్రెస్ విఫలయత్నం

కాంగ్రెస్ విఫలయత్నం